8 July, 2026 | 8:28 PM

Breaking News

ఉద్యాన శాఖ సబ్సిడీ పథకాలను జిల్లా రైతులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఎస్సీ వసతిగృహ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్   •   కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •  

రోడ్డు ప్రమాదం.. ఒకరికి తీవ్ర గాయాలు

23-07-2025 04:31 PM

ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు..

హుజూర్ నగర్/చింతలపాలెం: ఏపీ ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు అయినా సంఘటన సూర్యాపేట జిల్లా(Suryapet District) చింతలపాలెం మండలంలోని దొండపాడు గ్రామం సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోదాడ మండలం చిలుకూరు గ్రామానికి చెందిన కందుకూరి కోటేష్(30) తాపీ పని నిమిత్తం వెళ్తుండగా మార్గమద్యంలో దొండపాడు గ్రామంలోని గంగమ్మ గుడి వద్ద జగ్గయ్యపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అతను ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో కోటేష్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి హుజూర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై బాధితుడి కుటుంబ సభ్యులు చింతలపాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.