17 April, 2026 | 2:32 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

కేస్లాపూర్‌లో రోడ్లకు మరమ్మత్తులు

15-01-2026 03:00 AM

కృతజ్ఞతలు తెలిపిన మెస్రం వంశస్థులు, గిరిజనులు

ఉట్నూర్, జనవరి 14(విజయక్రాంతి): రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ నాగోబా జాతరకు వచ్చే ప్రజలకు రవాణా ఇబ్బందులు తొలగించేందుకు చర్యలు చేపడుతున్నారు. జాతర సందర్భంగా రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. ‘మరమ్మత్తులకు నోచని నాగోబా రోడు’ అనే శీర్షికతో మంగళవారం ‘విజయక్రాంతిదినపత్రికలో కథనం ప్రచురితమైంది.   దీంతో స్పందించిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా రోడ్లకు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులు బుధవారం రోడ్లకు మరమ్మత్తులను ప్రారంభించారు. సమస్యను పరిష్కరించిన ‘విజయక్రాంతిదినపత్రికకు, జిల్లా కలెక్టర్ రాజర్షిషాకు మెస్రం వంశస్థులు, గిరిజనులు కృతజ్ఞతలు తెలిపారు.