20 March, 2026 | 6:36 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

మాలలకు రోస్టర్ పాయింట్ ను మార్చాలి

17-07-2025 10:56 PM

మాల సంఘాల జెఏసి రాష్ట్ర  చైర్మన్ మందాల భాస్కర్

సూర్యాపేట,(విజయక్రాంతి): మాలలకు రోస్టర్ పాయింట్ సంఖ్యను ఏడు కు మార్చాలని, మాలలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చే  బహుమానం ఇదేనా అని మాల సంఘాల జెఏసి రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు రాష్ట్రంలో సుమారు 36 లక్షలు ఉన్న మాలల సామాజిక వర్గానికి రోస్టర్ పాయింట్  22 కేటాయించడం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్  లు దక్కకుండా చేయడం అన్యాయమన్నారు. దీనిని మాల సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తుందన్నారు. మాలలకు రోస్టర్ పాయింట్లను తగ్గించకుంటే   స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.