6 May, 2026 | 10:33 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

మాలలకు రోస్టర్ పాయింట్ ను మార్చాలి

17-07-2025 10:56 PM

మాల సంఘాల జెఏసి రాష్ట్ర  చైర్మన్ మందాల భాస్కర్

సూర్యాపేట,(విజయక్రాంతి): మాలలకు రోస్టర్ పాయింట్ సంఖ్యను ఏడు కు మార్చాలని, మాలలు ఓట్లు వేసి గెలిపిస్తే ఇచ్చే  బహుమానం ఇదేనా అని మాల సంఘాల జెఏసి రాష్ట్ర చైర్మన్ మందాల భాస్కర్ అన్నారు. మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో గురువారం ఎస్సీ కమ్యూనిటీ హాల్లో  ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సుమారు రాష్ట్రంలో సుమారు 36 లక్షలు ఉన్న మాలల సామాజిక వర్గానికి రోస్టర్ పాయింట్  22 కేటాయించడం విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్  లు దక్కకుండా చేయడం అన్యాయమన్నారు. దీనిని మాల సంఘాల జేఏసీ వ్యతిరేకిస్తుందన్నారు. మాలలకు రోస్టర్ పాయింట్లను తగ్గించకుంటే   స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.