9 April, 2026 | 3:52 PM

సదాశివనగర్‌లో ఆర్‌ఎస్‌ఎస్ ఉత్సవాలు

06-10-2025 01:22 AM

సదాశివనగర్, అక్టోబర్05 (విజయ క్రాంతి): రాష్ట్రీయ స్వయం సేవక్ సన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ లో ఆర్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు.

సదాశివ నగర్ మండల కేంద్రంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ పైడి ఎల్లారెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు ఏగ్డే వార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.