01-11-2025 12:08:13 AM
ధర్మపురి, అక్టోబర్ 31(విజయ క్రాంతి): సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా వెల్గటూర్ మండల కేంద్రంలో ఎస్త్స్ర ఉమాసాగర్ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంను అట్టాహాసంగా నిర్వహించా రు. వెల్గటూర్ అంబెడ్కర్ కూడలి నుండి కు మ్మరిపల్లి మోడల్ స్కూల్ వరకు 2కే రన్ ను నిర్వహించారు. 2కే రన్ లో పాల్గొన్న యువతను ఎస్త్స్ర ఉమాసాగర్ అభినందించారు. సమాజ అభ్యున్నతికి యువత పాటుపడాలనీ ఆ దిశగా యువత లక్ష్యాలను నిర్దేషిం చుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తో పాటు వివిధ గ్రామాల యువకులు,మాజీప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.