12-05-2025 06:03:20 PM
మహబూబాబాద్,(విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా దుంపల సందీప్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా కౌన్సిల్ సభ్యుడిగా పోలేపల్లి వెంకటేశ్వర్లు ను ఎంపిక చేసినట్టు భారతీయ జనతా పార్టీ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు వల్లబు వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ సందర్భంగా సందీప్, వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. గ్రామస్థాయి నుండి పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు కష్టపడి పనిచేస్తామని పేర్కొన్నారు.