31-01-2026 04:47:22 PM
చేగుంట,(విజయక్రాంతి): చేగుంట మండల కాంగ్రెస్ పార్టీ యూవ నాయకులు సండ్రుగు శ్రీకాంత్ దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ సి హెచ్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశానుసారం చందాయపేట గ్రామంలో పారిశుద్ధ కార్మికుడు ఎర్ర బాల్ నర్సయ్య తల్లి మరణించిన విషయం తెలుసుకొని వారి కుటుంబాన్ని పరామర్శించి అతని కుటుంబానికి 50 కేజీల బియ్యం, ఆర్థిక సహాయం అందజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తాలూకా మహేశ్వరీ సాయిబాబా, ఉపసర్పంచ్ పబ్బ నాగేష్ గుప్తా, తనవంతు సాయంగా చేరి యాభై కిలోల బియ్యం, ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మెంబర్ మెహమ్మద్ ముజామిల్, వార్డ్ మెంబర్ దప్పు కుమార్, గొండ స్వామి, కాంగ్రెస్ సినియర్ నాయకులు బైండ్ల శివరాజయ్య, యూసఫ్, ఇర్ఫాన్, శ్రీనివాస్, జంగంపల్లికుమార్. తదితరులు పాల్గొన్నారు.