22 June, 2026 | 2:27 PM

Breaking News

బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •  

కేతపల్లిలో మహిళా దారుణ హత్య

31-01-2026 05:16 PM

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆరు నెలల బాలుడు 

మర్రిగూడ(నాంపల్లి),(విజయక్రాంతి): నాంపల్లి మండలం కేతపల్లి గ్రామానికి చెందిన కుందేళ్ళ నగేష్ భార్య మమత (25) అనే మహిళ శనివారం దారుణ హత్యకు గురైంది ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం అదే గ్రామానికి చెందిన వంపు సుజాత కుందేళ్ళ నగేష్ తో కొన్నాళ్లుగా అక్రమ సంబంధం ఉంది. వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని నగేష్ భార్య మమతపై శనివారం మధ్యాహ్నం సమయంలో పెట్రోల్ పోసి సుజాత నిప్పంటించింది. అదే సమయంలో మమత   సంకలో ఉన్న 6 నెలల బాబుకు కూడా నిప్పంటుకుంది తీవ్ర గాయాలవడంతో బాబును చికిత్స నిమిత్తం నలగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు హఠాత్పరిణామాలతో జరిగిన సంఘటనలు భాగంగా వీధిలోకి పరిగెత్తుకొచ్చిన మమత అక్కడికడే మృతి చెందింది .   నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ దూదిరాజు ఎస్సై లింగారెడ్డి హుటా హుటిన సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తున్నారు.