15 April, 2026 | 12:36 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రామాల్లో పారిశుధ్యం మెరుగు పరచాలి

31-10-2025 11:33 PM

జిల్లా పంచాయతి అధికారి వెంకటేశ్వర్ రావు

మందమర్రి,(విజయక్రాంతి): మండలంలోని వివిధ గ్రామ పంచాయతీలలో పారిశుద్ధం మెరుగుపరిచి, వీధుల్లో చెత్తాచెదారం లేకుండా చర్యలు చేపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి డి వెంకటేశ్వరరావు సూచించారు. శుక్రవారం మండలంలోని పొన్నారం సారంగపల్లి గ్రామ పంచాయతీలను ఆయన అకస్మికంగా సందర్శించి, గ్రామ పంచాయతీ  రికార్డులు పరిశీలించారు. వాటర్, శానిటేషన్ కు సంభందించిన 7 రిజిష్టర్లను పరిశీలించారు. 

గ్రామంలో పారిశుద్ధ్య పనులు ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని, గ్రామ పంచాయతీ వర్కర్ల చేత ప్లాస్టిక్ సేకరణ చేయించాలని ఆదేశించారు. క్రమం తప్పకుండా గ్రామాల్లోని ఓవర్ హెడ్ ట్యాంక్ లు శుభ్రపరచాలని, క్లోరినేషన్ చేయాలన్నారు. ఇంటి పన్ను వసూలు ను వేగవంతం చేసి రసీదులను  ఆన్లైన్ చేయడం తో పాటు నవంబర్ 15 వరకు 100% పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమo లో ఎంపీఓ ఎం సత్యనారా యణ, పంచాయితీ కార్యదర్శి  హరీష్, సిబ్బంది పాల్గొన్నారు.