21 March, 2026 | 1:36 PM

Breaking News

తస్మాత్ జాగ్రత్త.. సమోసా, పఫ్స్ ప్రియులకు షాకింగ్ సీన్   •   రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం   •   'శ్రమ మాది.. శిలాఫలకాలు మీవి'.. రిబ్బన్ కటింగ్ చేయడమే కాంగ్రెస్ పని   •   వేరే వ్యక్తిని పెండ్లి చేసుకుందని.. తండ్రితో వెళ్లి మహిళపై ప్రియుడు దాడి   •   యువకుడి ప్రాణం తీసిన పెళ్లి ప్రపోజల్‌.. పండగ పూట తీవ్ర విషాదం   •   కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య.. అనాథలుగా మారిన చిన్నారులు   •   మార్కెట్‌లోకి 14 కోట్ల బ్యారళ్ల ఇరాన్ చమురు.. అమెరికా ఆంక్షలు ఎత్తివేత   •   హార్ముజ్ జలసంధి గురించి మాకు అవసరం లేదు.. వారికి ధైర్యం లేదు   •   కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా బండారి గంగాధర్   •   నవోదయకు ఎంపికైన పోకల తనుష్   •  

తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయం

14-01-2026 04:06 PM

 మట్టిపల్లి సైదులు 

మోతే,(విజయ క్రాంతి): తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు సంక్రాంతి ముగ్గులు నిలయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టి పెళ్లి సైదులు  అన్నారు. బుధవారంమండల పరిధిలోనిసిరికొండ గ్రామంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో పాల్గొని విజయం సాధించిన మహిళలకు ముఖ్య అతిథిగా హాజరై బహుమతులను ప్రధానం చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సైదులు మాట్లాడుతూ మహిళలకు అత్యంత ఇష్టమైన పండుగలలో సంక్రాంతి పండుగ ఒక్కటి అన్నారు. మహిళలు దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయడం కోసం ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలుగు సంస్కృతి ఉట్టి పట్టేలా సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం మన సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవించడం అన్నారు.

ఈ సందర్భంగా ముగ్గుల పోటీల్లో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ముగ్గుల పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రోత్సాహక బహుమతులు  అందజేశారు. ఈ కార్యక్రమంలోతెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలుజంపాల స్వరాజ్యం,వ్యవసాయ కార్మిక సంఘం మండల ప్రధాన కార్యదర్శి కిన్నెర పోతయ్య, మండల కమిటీ సభ్యులు  బోడ పట్ల హుస్సేన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కెనపల్లి వినయ్, విద్యార్థి నాయకురాలు మట్టిపల్లి మానస, వ్యవసాయ కార్మిక సంఘం నాయకురాలు కటారి పార్వతమ్మ, కుంటి గొర్ల గంగమ్మ, చిట్యాల పద్మ, జంపాల ఉప్పయ్య, అక్కెనపల్లి నాగమ్మ, బోడ పట్ల సాంబమ్మ, శాంతమ్మ తదితరులు పాల్గొన్నారు.