20 March, 2026 | 5:47 PM

Breaking News

షబ్బీర్ అలీని కలిసిన భిక్కనూర్ కాంగ్రెస్ నాయకులు   •   రీడింగ్ ఛాంపియన్షిప్ పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేసిన ఎంఈఓ రాజయ్య   •   తాసిల్దార్ కార్యాలయం నూతన భవనం మంజూరు కోసం వినతి   •   భిక్కనూర్ జెడ్పీ పాఠశాలలో నైపుణ్యాభివృద్ధి ల్యాబ్‌ల ప్రారంభం   •   జగన్, షర్మిల ఆస్తుల పంచాయతీ.. వైఎస్ విజయమ్మ సంచలన ప్రకటన   •   సేలంలో ఘోర రోడ్డు ప్రమాదం: ఎనిమిది మంది మృతి   •   కాంగ్రెస్‌ది చోర్ విధానం.. బడ్జెట్‌పై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు   •   పెరిగిన 'పవర్‌' పెట్రోల్‌ ధర   •   300 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన ఢిల్లీ సీఎం   •   ముంబై ప్రెస్ క్లబ్‌కు 'గ్యాస్ బాంబు' బెదిరింపు   •  

నూతనంగా గెలుపొందిన ప్రజా ప్రతినిధులకు సన్మానం

14-01-2026 05:14 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): నూతనంగా గెలుపొందిన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని  వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు సూచించారు. బుధవారం బాబాపూర్ సర్పంచ్ రాజన్న, ఉపసర్పంచ్ కిష్టయ్యలను ఆయన శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ... గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, గ్రామంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయాలు చేయాలని, అనంతరం అందరితో కలసి గ్రామాభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో భాజపా మండల అధ్యక్షుడు సుంకరి పెంటయ్య, నాయకులు మల్లేష్ యాదవ్, ఇందులాల్, వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.