15 April, 2026 | 12:52 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా: సర్పంచ్ కావటి సుధాకర్

22-12-2025 11:28 PM

తరిగొప్పుల,(విజయక్రాంతి): తరిగొప్పుల మండలం అబ్దుల్ నాగారం గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం సోమవారం కొలువుదీరింది. డిసెంబర్ 14న రెండో విడత పంచాయతీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన కాంగ్రెస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి కావటి సుధాకర్,  ఉప సర్పంచ్ నీల సంపత్, ఎనిమిది మంది వార్డు మెంబర్లు సోమవారం జరిగిన ప్రమాణ స్వీకారమహోత్సవం లో గ్రామ  కార్యదర్శి రవీందర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సందర్భంగా సర్పంచ్ గా ఎన్నికైన సుధాకర్  మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో సర్పంచ్ గా  గెలిపించినందుకు  అబ్దుల్ నాగారం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ అబ్దుల్ నాగారం గ్రామపంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ పంచాయతీ,సిబ్బంది, ఖాత సందీప్, పరుశరాములు, విజయలక్ష్మి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.