11 April, 2026 | 12:10 PM

Breaking News

సమయోచిత చర్యలతో గ్రామానికి నీటి భద్రత   •   భాగిర్తిపల్లిలో ఇందిరమ్మ గృహ ప్రవేశం   •   మహాత్మా జ్యోతిరావు పూలే కు ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్   •   ముత్తారంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు   •   బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు పూలే   •   పోటు రంగారావుపై NIA ఉపా చట్టం కేసు ఎత్తివేయాలి ‌‌   •   మంగళ్‌హాట్‌లో కార్డెన్ సెర్చ్— గ్యాస్ సిలిండర్లు, బైకులు స్వాధీనం   •   ముంబైలో ఘోర అగ్నిప్రమాదం— సిలిండర్ పేలుళ్లతో తీవ్ర భయాందోళన   •   కర్ణాటకలో యూత్ కాంగ్రెస్‌ నేత దారుణహత్య.. స్థానికుల్లో భయాందోళన!   •   జ్యోతిరావు పూలే జయంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని మోదీ   •  

డంపింగ్ యార్డ్‌ను మార్చాలని వినతి

23-12-2025 01:03 AM

చిట్యాల, డిసెంబర్ 22(విజయ క్రాంతి): చిట్యాల మున్సిపాలిటీ చెందిన శివనేని గూడెం పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ ను అక్కడినుండి వేరొక చోటికి మార్చాలని  కోరుతూ ఆ గ్రామానికి చెందిన అఖిలపక్ష నాయకులు సోమవారం గ్రీవెన్స్ డే లో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ దీనిపై త్వరలోనే చర్యలు తీసుకొని వీలైనంత త్వరలో  వేరొక చోట ఏర్పాటు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.

అనంతరం సంబంధిత తాసిల్దార్  కు కూడా వినతి పత్రం అందజేసి కలెక్టర్ కు వినతి పత్రం అందజేసినట్టు  వారు తెలిపారు. ఈ డంపింగ్ యార్డ్ లో చెత్తను డంపు చేయడం వల్ల గ్రామస్తులు అనారోగ్యాల పాలై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు వాపోయారు. ఈ కార్య క్రమంలో అఖిలపక్ష నాయకులు రుద్రవరం లింగస్వామి, బొబ్బిలి సుధాకర్ రెడ్డి, రుద్రవరం సునీల్, ఎడ్ల మాలింగం, కన్నెబోయిన మాలింగం, కన్నబోయిన శ్రీధర్ యాదవ్, గుండాల నరేష్ గౌడ్, రుద్రవరం దశరథ, ఉపేందర్రెడ్డి, రుద్రవరం మధు, కన్నెబోయిన మురళి తదితరులు ఉన్నారు..