17-11-2025 01:55:39 AM
కీసర, నవంబరు 16(విజయక్రాంతి): శ్రీ చీర్యాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం సందర్భంగా శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు .
కార్తీక మాసం చివరి ఆదివారం విశిష్టత కారణంగా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి , సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. వ్రతం అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి పునీతులయ్యారు.
కార్తీక దీపాలు, గోమాత పూజ:
భక్తులు దేవాలయ ప్రాంగణంలో ఉన్న సప్తవృక్షాలు , నాగదేవత వద్ద ప్రత్యేకంగా కార్తీక దీపాలను వెలిగించారు. గోమాతకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి, తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం అంతా ఆధ్యాత్మిక శోభ సంతరించుకొంది . ఆలయ ఫౌండర్ , చైర్మన్ మల్లారపు లక్ష్మీనారాయణ , ధర్మకర్త శ్రీహరి పాల్గొన్నారు.