09-01-2026 05:21:26 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గౌడవెల్లి వాస్తవ్యులు బాల్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బాల్ రెడ్డి మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా అందరు పనిచేయాలని సీఎం సూచించినట్లు తెలిపారు.