9 April, 2026 | 7:00 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

విగ్రహావిష్కరణకు ముందే శివాజీ విగ్రహానికి నిప్పు

01-01-2026 12:20 AM

వరంగల్ (మహబూబాబాద్) డిసెంబర్ 31 (విజయక్రాంతి): వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బంధనపల్లి గ్రామంలో ఇటీవల ఏర్పాటు చేసిన చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించకుండానే బుధవారం తెల్లవారుజామున  దుండగులు నిప్పంటించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఇటీవలే చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అన్ని పనులు పూర్తికావడంతో త్వరలోనే విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  విగ్రహానికి నిప్పు పెట్టిన విషయం ఉదయం గ్రామస్థులకు తెలియడంతో అక్కడికి చేరుకున్న వారు మంటలు ఆర్పి వేశారు. సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహం చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేశారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సంఘటనకు ఆకతాయిలు పాల్పడ్డారా, లేక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. దుశ్చర్యకు పాల్పడ్డ దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి అంటూ గ్రామస్తులు పోలీసులను కోరారు.