09-07-2025 12:00:00 AM
నిజామాబాద్, జూలై8 (విజయక్రాంతి) : నిజామాబాద్ నగరం నుండి 44వ జాతీయ రహదారి కి అప్రో రోడ్ గా ఉన్న నిజామాబాద్ హైదరాబాద్ ప్రధాన రహదారి మాధవ నగర్ టీ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న రైల్వే ఓవర్ బ్రిడ్జి ఆర్ఓబి పనులు నిర్మాణం గడువు ముగిసినప్పటికీ ఇంకా అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గత మే 31 తో నిర్మాణ గడువు ముగిసినప్పటికీ జూన్ మాసం గడిచి జూలై %దీలిజిబి% వారం రోజులు కావస్తున్నప్పటికిని.
బుజ్జి మధ్యలో బెడ్ అప్రో పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి. హైదరాబాద్ వెళ్లే మార్గంలో కేవలం కుడివైపున మాత్రమే పనులు జరుగుతున్నాయి. ఎడమవైపు మొండి పిల్లర్లు దర్శనమిస్తున్నాయి. దాదాపుగా ఇంకా ఈ సంవత్సరం పూర్తి వరకు పనులు కొనసాగుతాయన్న సందేహాలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.
ఒకవైపు తమ వంతు పూర్తి సహకారం కేంద్రం పూర్తి బడ్జెట్ కేటాయించినప్పటికిని రాష్ర్ట ప్రభుత్వం నుండి సరైన నిధులు అందడం లేదని ఇటీవల ఎంపీ అరవింద్ విలేకరుల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో బిఆర్ఎస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ సహకరించ డం లేదని బహిరంగంగా ఆరోపించారు.
ఈ నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గానీ ఇన్చార్జి మంత్రులు గాని పత్రికలలో అరవిందు ఆరోపణలు వెలువడినప్పటికిని ఉలుకు పలుకు లేకుండా ఉండడంతో కాలంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతాయో లేదో అని సందేహాలు ప్రజల నుండి తలెత్తుతున్నాయి. 93. 31 రూపాయల తో చేపట్టిన ఈ ఆర్ఓబి బ్రిడ్జి పనుల గడువు దగ్గర పడింది. 20 25 మే 31 నాటికి ఈ పనులు పూర్తి కావాల్సి ఉంది.
అని ఇప్పటివరకు పూర్తికాలేదు ఎందుకు రాష్ర్ట ప్రభుత్వాలే కారణం అని బిజెపి శ్రేణులు ఆరోపిస్తున్నాయి. త్వరితగతిన రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు పూర్తి చేస్తామని పది రైల్వే ఓవర్ బ్రిడ్జిల్లా పనులు లక్ష్యంగా పెట్టుకున్నామని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ప్రకటించినప్పటికిని మాధవ నగర్ ఆర్ఓబి పనులు ఇంకా పూర్తి కాలేదు. మే 31 నాటికి గడువు పూర్తయి. 40 రోజులు వస్తున్నప్పటికిని పనులలో ఎలాంటి పురోగతి లేదు..
గడువులోగా పూర్తవుతుందనుకున్నా రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు నిర్దిష్ట లక్ష్యం తో రాష్ర్ట ప్రభుత్వం గానీ స్థానిక ప్రజాప్రతినిధులు గాని పట్టించుకోకపోవడంతో నిధులలేమితో. ఆర్ఓబి పనులు చెతకిలాబడ్డాయి. రాష్ర్ట ప్రభుత్వం నిధులు కేటాయించడంలో జాప్యం జరిగిన కారణంగా నిర్మాణ పనులలో ఆలస్యం జరుగుతోందని ఎంపీ అరవింద్ తెలిపారు.
ఈ రైలు మార్గం మీదుగా భారీ హె గ్యాటర్లతో ఫ్లోరింగ్ షీట్స్ వేయాల్సి ఉంది ఈ పని మొత్తం ఒకవైపు నుండి కొనసాగడంతో మరొకవైపు పని మిగిలిపోయి ఉంది. ఒకవైపు ఫ్లోరింగ్ స్లాబ్ పనులు జరుగుతూ ఉండడంతో మరోవైపు పనులకు గడువు దాటి పోయినప్పటికీని బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరగడం లేదు. నిజామాబాద్ నగరం లోకి ప్రధాన ప్రవేశ ద్వారం మాధవ నగర్ రైల్వే మార్గం మీదుగా ఉండడంతో నిత్యం జిల్లాలలోకి వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి.
ఈ మార్గం నుంచి 50 కి పైగా ప్రయాణికుల రైలు గూడ్స్ బండ్లు ప్రయాణిస్తుండడంతో తరచూ రైలు మార్గానికి ఇరువైపులా గేట్లు చేయడంతో తరచూ వాహనాలు కిలోమీటర్స్ కు పైగా నిలిచిపోతున్నాయి అత్యవసర సర్వీసులు గల వాహనాలు అంబులెన్స్ కూడా ఈ రైల్వే గేట్ వేయడంతో ట్రాఫిక్ లో చిక్కుకుపోతున్నాయి. ట్రైన్లు వెళ్లిన తదుపరి గేట్లు ఎత్తేయడంతో ఇరువైపుల వాహనాలు దూసుకు రావడంతో కురుక్షేత్ర యుద్ధ దృశ్యాన్ని తలపిస్తోంది.
గంటల తరబడి రైళ్లకే ఎదురు చూసి విసిగి గేటు నుండి వాహనాలను తరలించే సమయంలో ప్రమాదాలకు గురైన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. మాధవ్ నగర్ రైల్వే గేటు వద్ద పట్టాలపై నుంచి స్లాబ్ పనులు సాగాల్సి ఉందని అందుకు గాని ఇరువైపులా కొంత మేరకు పనులు నిలిపివేశామని పనులకు ఉపయోగించడానికి భారీ క్రేన్లు వచ్చినప్పుడు తీవ్ర ఇబ్బంది ఎదురవుతుందని ఉద్దేశంతో పనులు నిలిచిపోయాయనీ సంబంధిత అధికారులు తెలిపారు.
రైల్వే పనుల కారణంగా మిగతా పనులు జరపడంలో జాప్యం జరుగుతోందని రైల్వే అధికారుల అనుమతితో రైల్వే పట్టాల వరకు పనులు పూర్తి చేయనున్నట్టు ఆర్ఓబి పర్యవేక్షకులు తెలిపారు. కేంద్ర రాష్ర్ట ప్రభుత్వ అధికారుల మధ్య సమన్వయం లోపించడంతోనే పనులలో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రజలు ఆరోపిస్తున్నారు.
ఈ విరు శాఖల సమన్వయంతోటే పనులు నిర్ణిత సమయానికి పూర్తవుతాయని ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఆర్ఓబి పనులు 20 22 సెప్టెంబర్ లో ప్రారంభం అయినప్పటికీని ఇప్పటివరకు 75% పూర్తికాగా మరో ముప్పు ఐదు శాతం పనులు పూర్తికావాల్సి ఉంది. నిర్ణీత సమయంలో మాధవ నగర్ రైల్వే బ్రిడ్జి పూర్తి అవుతే ఈ మార్గం గుండా ప్రయాణించే ప్రజల కష్టాలు తీరనున్నాయి.