13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఘనంగా సిద్దార్థ వార్షికోత్సవం

26-01-2026 03:04 AM

ముకరంపుర, జనవరి 25 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని సిద్ధార్థ విద్యాసంస్థల 30 సంవత్సరాల వార్షికోత్సవ వేడుకలు సంస్కృతి-2026 పేరుతో రెండు రోజుల పాటు అంబేద్కర్ స్టేడి యంలో ఘనంగా నిర్వహించారు. కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్, పాఠశాల చైర్మన్ దాసరి శ్రీపాల్ రెడ్డి, డైరెక్టర్ దాసరి స్వప్న శ్రీపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ఆరంభించారు.

విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. 30 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనము నిర్వహించారు. విద్యార్థుల పేరెంట్ గేమ్ గాలా-2025 క్రీడలలో గెలుపొందిన తల్లిదండ్రులకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.