23 May, 2026 | 2:29 PM

Breaking News

నేరెళ్ళ బాలికల గురుకులంలో బోధనా సిబ్బంది నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఇచ్చిన మాట నిలబెట్టుకున్న తంగళ్ళపల్లి సర్పంచ్   •   వినియోగదారులకు చేరువగా టీజీఎన్పీడీడీసీఎల్ యాప్   •   మండుతున్న ఎండలకు నిర్మానుష్యంగా దమ్మపేట మెయిన్ రోడ్డు   •   పుణ్య నాయక్ తాండ చింతలపూడి మధ్య వాగుపై వంతెన నిర్మించండి   •   రైతుల సమస్యలపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట బీజేపీ నిరసన   •   జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన డీసీసీ అధ్యక్షులు   •   నూతన అభివృద్ధి కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం   •   సహకార సంఘం ఎదుట జొన్న రైతుల నిరసన   •   తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను 30 నెలలైనా నెరవేర్చలేదు   •  

గ్రామ ఫౌండేషన్ పేరిట మహిళల మోసం రెండు వందల మందికి పైగా బాధితులు

26-01-2026 03:14 AM

తంగళ్ళపల్లి, జనవరి 25 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట మహిళలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫౌండేషన్లో చేరితే నెలకు నిత్యవసర సరుకులు, నగదు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరినుంచి రూ.2750 చొప్పున వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

దాదాపు రెండు వందల మందికి పైగా మహిళలు డబ్బులు చెల్లించగా, ప్రారంభంలో నామమాత్రంగా సరుకులు, ఒక నెల నగదు ఇచ్చి ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిని ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించి న్యాయం కోరారు.తమ డబ్బులు తిరిగి ఇప్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.