13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

గ్రామ ఫౌండేషన్ పేరిట మహిళల మోసం రెండు వందల మందికి పైగా బాధితులు

26-01-2026 03:14 AM

తంగళ్ళపల్లి, జనవరి 25 (విజయక్రాంతి ): రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామంలో గ్రామ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ పేరిట మహిళలను మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫౌండేషన్లో చేరితే నెలకు నిత్యవసర సరుకులు, నగదు ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరినుంచి రూ.2750 చొప్పున వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.

దాదాపు రెండు వందల మందికి పైగా మహిళలు డబ్బులు చెల్లించగా, ప్రారంభంలో నామమాత్రంగా సరుకులు, ఒక నెల నగదు ఇచ్చి ఆ తర్వాత చెల్లింపులు నిలిపివేసినట్లు తెలిపారు. డబ్బులు వసూలు చేసిన ఉద్యోగిని ప్రశ్నించినా స్పందన లేకపోవడంతో ఆదివారం గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట మహిళలు బైఠాయించి న్యాయం కోరారు.తమ డబ్బులు తిరిగి ఇప్పించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు.