15 June, 2026 | 7:48 PM

Breaking News

రెడ్లకుంట ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా 'బడి బాట'   •   హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలలోనే భవిష్యత్తుకు బలమైన పునాది!   •   పాము కాటుతో మృతి చెందిన రాజేశ్వర్ కుటుంబానికి ఆర్థిక సహాయం   •   ఇందిరమ్మ గృహాలను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్   •   భారీ వర్షాల నేపథ్యంలో వరద నీరు నిల్వ ఉండకుండా ముందస్తు చర్యల కోసం అధికారుల పర్యటన   •   ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించాలి   •   రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •  

గ్రామ సర్పంచ్ లను సత్కరించిన సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

15-12-2025 07:37 PM

మంథని (విజయక్రాంతి): గ్రామ పంచాయతీ మొదటి విడత ఎన్నికల్లో గెలుపొందిన మంథని మండలం నగరంపల్లి సర్పంచ్ గా ఉప సర్పంచ్, వార్డు సభ్యులను మంథని సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ శాలువాతో సోమవారం సాయంత్రం ఘనంగా సత్కరించారు. స్థానిక సింగిల్ విండో కార్యాలయంలో సర్పంచ్ నాతరి లత-శ్రీనివాస్, ఉపసర్పంచ్ పొరెడ్డి ప్రసన్న, తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు నౌండ్ల సదానందం, మల్యాల కిరణ్ కుమార్, తోకల శ్రీనివాస్, ఏట శ్రీనివాస్ లను చైర్మన్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. తమ విజయానికి కృషి చేసిన మంత్రి శ్రీధర్ బాబు, టీపిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబులకు సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ కు గ్రామస్తులకు, నాయకులు, కార్యకర్తలకు, ప్రజాప్రతి నిధులకు సర్పంచ్, వార్డు సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలం ప్రభాకర్, బూడిద రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.