calender_icon.png 23 December, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఎస్‌లకు డీఐజీలుగా పదోన్నతి

23-12-2025 01:25:21 PM

హైదరాబాద్: తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఆరుగురు ఐపీఎస్(IPS) అధికారులను డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హోదాకు పదోన్నతి కల్పించేందుకు ఎంప్యానెల్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary to the Government) కె. రామకృష్ణారావు ఒక ఉత్తర్వు జారీ చేశారు. పదోన్నతులు పొందిన ఐపీఎస్ అధికారుల్లో ఎన్ శ్వేత, ఆర్ భాస్కరన్, జి చందన దీప్తి, కల్మేశ్వర్ శింగెనవర్, రోహిణి ప్రియదర్శిని, ఎస్‌ఎం. విజయ్ కుమార్. పదోన్నతి పొందిన వారిలో, కింది పోస్టింగ్‌లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. శ్వేత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, డిడి, హైదరాబాద్‌గా కొనసాగుతారు. భాస్కరన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సిఐ సెల్, ఇంటెలిజెన్స్‌గా కొనసాగుతారు. చందన దీప్తి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, రైల్వేస్, సికింద్రాబాద్‌గా కొనసాగుతారు. విజయ్ కుమార్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సిద్దిపేటగా కొనసాగుతారు. కల్మేశ్వర్ శింగేనవర్, రోహిణి ప్రియదర్శిని ఇద్దరూ కేంద్ర డిప్యూటేషన్‌పై ఉన్నారు.