15 March, 2026 | 8:23 PM

Breaking News

విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •  

హత్యాయత్నం కేసులో ఆరుగురు రిమాండ్

25-12-2025 01:45 AM

తాండూరు, డిసెంబర్ 24(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండల కేంద్రంలో ఈ నెల 18వ తేదీన సర్పంచ్ జంగం బసమ్మ భర్త రుమల్ల సంగయ్య స్వామి పై జరిగిన హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ధరూరు సీఐ రఘురాములు తెలిపిన వివరాల ప్రకారం ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రత్యర్థులు  ఓటమిని జీర్ణించుకోలేక పక్కా పథకం ప్రకారం కోటిపల్లి  గ్రామానికి చెందిన 1,మొహమ్మద్ షాకీర్, 2, ఆనం శివకుమార్ ,3 మొహమ్మద్ అక్రమ్, 4  అస్మత్ ఖురేషి, 5 మహమ్మద్ షా నవాజ్ 6 నక్కల బందయ్య కలిసి దాడి చేశారు.

పథకం ప్రకారం  రాత్రి 10 గంటల 40 నిమిషాలకు దాడికి పాల్పడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించడంతో వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. సర్పంచ్ బసమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి లోతైన విచారణ జరుపుతున్నామన్నారు .ఆరుగురు నిందితులపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని..శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన కఠిన చర్యలు  తీసుకుంటామని ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.