15-08-2025 11:47:51 PM
ఢిల్లీ స్వాతంత్రం వేడుకల్లో పాల్గొన్న దంపతులు
మునుగోడు,(విజయక్రాంతి): వినూత్నమైన పంట సాగు చేసినందుకు ఓ దంపతులకు ఢిల్లీలో స్వాతంత్రం వేడుకల్లో పాల్గొనేందుకు ఆరుదైన గౌరవం దక్కింది. వివరాల్లోకి వెళితే మునుగోడు మండలం కోతులారం గ్రామానికి చెందిన జాజుల బుచ్చిరాములు భార్య సైదమ్మ లు కోతులారం గ్రామంలో కలబంధ సాగు సాగుచేస్తున్నారు. ఆర్సిఎఫ్సి సిఫార్సుతో కేంద్ర ఆయుష్ విభాగం ప్రత్యేక ఆహ్వానం మేరకు ఢిల్లీ లో జరిగే స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించారు.