15 July, 2026 | 1:31 PM

Breaking News

బోధన్ పట్టణంలో జగన్నాధ రధయాత్రకు ఏర్పాట్లు పూర్తి   •   గీతంలో ఇండస్ట్రియల్ ఫార్మసీ   •   ఢిల్లీకి బీఆర్ఎస్ పార్టీ బృందం.. కేంద్రమంత్రితో కేటీఆర్ ప్రత్యేక భేటీ   •   డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ సమావేశం   •   'నా దీక్షను ఆపగలరు కానీ, పోరాటాన్ని కాదు'.. పోలీసుల పహారాలో ఇంట్లోనే దీక్ష   •   ప్రశాంత్ రెడ్డి గృహనిర్బంధం.. ప్రజాస్వామ్య హక్కుల ఉల్లంఘనే: కేటీఆర్   •   కాచాపూర్‌లో గొర్రెలు, మేకలకు పీపీఆర్ టీకాల కార్యక్రమం   •   జర్నలిస్టుల పిల్లలకు ఫీజులో రాయితీ ఇవ్వాలని వినతి   •   గుండెపోటుతో ఇల్లందు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవి నాయక్ మృతి   •   నిరంత నొప్పి, వాపును నిర్లక్ష్యం చేయకండి   •  

డంప్ యార్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక రోడ్ మ్యాప్..

16-07-2025 04:47 PM

కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు

కరీంనగర్,(వికాయక్రాంతి): కరీంనగర్ శివారులో బైపాస్ రోడ్డులో అనేక సంవత్సరాలుగా పట్టిపీడిస్తున్న సమస్య పరిష్కారానికి ఒక ప్రత్యేకమైన రోడ్డు మ్యాప్ రూపొందిస్తామని, దాని ప్రకారం ముందుకెళ్తామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

బుధవారం కొత్తపల్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో రాజేందర్ రావును డంప్ యార్డ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్న బాధితులు, ఆయా డివిషన్లకు చెందిన కాలనీ వాసులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కలిశారు. ఈ సందర్భంగా డంప్ యార్డ్ వల్ల ఐదు డివిజన్లకు సంబంధించిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజేందర్రావుకు వివరించారు.

డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామని తెలిపారు. ఈ సమస్య్ పరిష్కారానికి అందరం కలిసి కలిసికట్టుగా సమిష్టిగా కృషి చేద్దామని హామీ ఇచ్చారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, సమస్య పరిష్కారానికి ఎలాంటి మార్గాలు అన్వేషించాలనే విషయంపై  అధ్యాయం చేస్తానని తెలిపారు. మధ్యప్రదేశ్లో సీనియర్ ఐఏఎస్ అధికారి పరికిపండ్ల నరహరితోను కరీంనగర్లో అవగాహన సదస్సు నిర్వహించేలా చర్యలు తీసుకుంటారని తెలిపారు.