15 April, 2026 | 12:35 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

స్పైసీ ఫుడ్.. అతిగా వద్దు!

27-04-2025 12:00 AM

ఇటీవల కాలంలో ‘బిర్యానీ లేనిదే ముద్ద దిగదు’ అనే వారిని చాలా మందినే చూసుంటాం. కాని మసాలాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే సైడ్‌ఎఫెక్ట్స్ తప్పవు అంటున్నారు నిపుణులు.

తరచూ మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే సున్నితంగా ఉండే కడుపు లోపలి పొరలు దెబ్బతింటాయి. గుండెల్లో మంటగా అనిపిస్తుంది. 

మసాలాలు ఎక్కువైతే జీర్ణం అవ్వడానికి అధిక సమయం పడుతుంది. కడుపుబ్బరంగా అనిపిస్తుంది. తేన్పులతో ఇబ్బంది పడతారు. 

కొన్నిసార్లు డయేరియా సమస్య వస్తుంది. ఆహారంలో కారం, మసాలాలు ఎక్కువగా ఉంటే.. వాంతులు, విరేచనాల వంటివీ వెంటాడతాయి.

కొందరికైతే చర్మంపై దద్దుర్లు, మొటిమలు, మచ్చలు, దురద వంటి సమస్యలు వస్తాయి. చర్మం వాయడంతో పాటు మంటగా అనిపిస్తుంది. 

వెల్లుల్లి, ఉల్లిపాయ, కారం ఘాటైన వాసనను కలిగి ఉంటాయి. వీటిని తిన్న తర్వాత చాలా సమయం వరకు నోరు దుర్వాసన వస్తుంది. 

అధిక కారం, మసాలాలు ఉన్న ఆహారం తరచూ తీసుకుంటే గొంతులోని సున్నితమైన పొరలు దెబ్బతింటాయి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. 

శరీర ఉష్ణోగ్రతలు పెరిగేందుకు మసాలాలు కారణం అవుతాయి. సాధారణ స్థాయి కంటే చెమటలు ఎక్కువగా పడతాయి.