3 July, 2026 | 10:44 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

పూడూరులో ఘనంగా శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ బోనాల ఉత్సవాలు

19-05-2025 12:35 AM

మేడ్చల్, మే 18(విజయ క్రాంతి): మేడ్చల్ మున్సిపల్ పరిధి పూడూరు గ్రామంలో మూడు సంవత్సరాలకు ఒక్కసారి వైభవంగా నిర్వహించే శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ బోనాల ఉత్సవాలు ఆదివారం వైభవంగా నిర్వహించారు.ఈ సందర్భంగాఆలయ పూజారి పాలకుర్తి శివప్ర సాద్ అమ్మవార్లను నూతన వస్త్రాలతో సుందరంగా అలంకరించారు.ఆనవాయితీ ప్రకారం గ్రా మంలోని వైశ్యులు అమ్మవారికి మొదటి బోనం సమర్పించారు.

మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ బట్టు నాగిరెడ్డి కుటుంబ సభ్యులతో,ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కంభం వెంకట్ రాజ్ తనయుడు కంభం అంజన్ రాజ్  అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామంలోని మహిళలు,భక్తులు పెద్ద ఎత్తున  శ్రీ శివ్వంపే ట పోచమ్మ- మైసమ్మ దుర్గమ్మ,ముత్యాలమ్మలకు బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.భక్తుల కోలాహాలంతో ఆలయ పరిసరాలల్లో సందడి నెలకొంది.