24-11-2025 12:00:00 AM
ఆలేరు, నవంబర్ 23 (విజయ క్రాంతి): జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ అధ్యక్షులు ముక్కేర్ల బిక్షపతి అధ్యక్షతన ఆలేరులో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య హాజరై సంస్థ విధివిధానాలను తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులుగా గంగాధరి సుధీర్ కుమార్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అనంతరం నియామక పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రచార కార్యదర్శి లక్ష్మణ్, స్టేట్స్ సోషల్ మీడియా సభ్యులు దిలీప్, విక్రమ్ గౌడ్, కురిమేటి రాజకుమార్, రవికుమార్, సాగర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.