17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

బీసీల ఆత్మగౌరవ రక్షణకు బంద్ కు మద్దతు ఇవ్వండి

16-10-2025 08:08 PM

ఘట్ కేసర్: బీసీ జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 18న పిలుపునిచ్చిన బంద్ ను విజయవంతం చేయాలని ఉమ్మడి ఘట్ కేసర్ మండల బీసీ జేఏసీ కన్వీనర్ కురుపాల విజయకుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం విలేకరుల సమావేశంలో విజయ్ కుమార్ మాట్లాడుతూ బీసీల ఆత్మగౌరవం కోసం జరుగుతున్న ఈ రాష్ట్ర బంద్ మన హక్కుల సాధనలో కీలక ఘట్టమన్నారు. జరగనున్న ఈ బంద్ కార్యక్రమంలో విద్యాసంస్థలు, వ్యాపారులు, ఉద్యోగులు, ప్రజలు అందరూ స్వచ్ఛందంగా పాల్గొని బీసీల ఐక్యతను ప్రదర్శించాలని కోరారు. బంద్ ద్వారా ప్రభుత్వం బీసీల సమస్యలకు పరిష్కారం దిశగా చర్యలు చేపట్టేలా ఒత్తిడి తెచ్చే ప్రయత్నమన్నారు.