17 June, 2026 | 11:53 AM

Breaking News

రాష్ట్రవ్యాప్తంగా 'తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు' నిర్మిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు   •   SIRతో ప్రతి ఓటరు అప్రమత్తంగా ఉండాలి: తాండూరు ఎమ్మెల్యే   •   విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ   •   చెట్టు అటవీ శాఖది... గుట్ట రెవెన్యూ శాఖది..!   •   మంత్రులు అడ్లూరి లక్ష్మణ్, వివేక్‌ సవాళ్లకు హరీశ్ రావు కౌంటర్   •   ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం... 12 మందిపై కేసు   •   కోటాలో విద్యార్థులతో కలిసి రాహుల్ మెగా ర్యాలీ   •   గుజరాత్లో ఘోర బస్సుప్రమాదం: ఆరుగురు మృతి   •   అనారోగ్యంతో చికిత్స పొందుతున్న పెండెల పవన్‌ను పరామర్శించిన దుద్దిళ్ల శ్రీనుబాబు   •   బెజ్జూర్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం   •  

నూతన ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరణ

06-11-2025 08:50 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జాజిరెడ్డిగూడెం మండల నూతన ఎంపీడీఓగా పల్లపు ఝాన్సీ గురువారం బాధ్యతలు స్వీకరించారు.గత 8నెలలుగా ఇంచార్జీ ఎంపీడీఓగా విధులు నిర్వహించిన ఎంపీఓ గోపి నుంచి బాధ్యతలు తీసుకున్నారు. గ్రూప్-1 పరీక్షలకు సిద్ధమై ఎంపీడీఓ హోదా సాధించిన ఝాన్సీకి ఇది తొలి పోస్టింగ్. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది ఘన స్వాగతం పలికి పుష్పగుచ్చాలు, శాలువాలతో శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మాట్లాడుతూ మండలంలోని ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూపరిండెంట్ రామకృష్ణ, ఏపీఓ ఉపేందర్,ఈసీ మహేష్,సీఓలు సుధీర్,సంతోష, నవీన్,జూనియర్ అసిస్టెంట్ శిల్పిక,సాయి ప్రదీప్, టీఏ నాగమణి,కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.