17 April, 2026 | 10:27 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

నాటుసారా రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడి

12-05-2025 02:11 AM

నాగర్ కర్నూల్, మే 11: నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్ల వద్ద రాష్ట్ర టాస్క్ ఫోర్స్ టీం అక్రమ నాటుసారా రవాణాను అడ్డుకుంది. హైదరాబాద్ నుండి నాగర్ కర్నూల్ వైపు వస్తున్న మారుతి ఓమ్ని వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో భారీ పరిమాణంలో నాటుసారా తయారీకి ఉపయోగించే పదార్థాలను గుర్తించారు. ఎస్‌ఐ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీలో 432 కిలోల నల్లబెల్లం, 10 కిలోల పటిక, 5 లీటర్ల నాటు సారాను స్వాధీనం చేసుకున్నారు.

ఈ వాహనాన్ని నడుపుతున్న గుబ్బ శివకుమార్ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. తనిఖీలో పాల్గొన్న టాస్క్ ఫోర్స్ సభ్యులు హనీఫ్, సాయికిరణ్, కౌశిక్, నితిన్, శంకర్లు ఉన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులను నాగర్ కర్నూల్ ఆబ్కారీ స్టేషన్కు అప్పగించామని ఆబ్కారీ సీఐ కళ్యాణ్ తెలిపారు.