calender_icon.png 3 August, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ కార్యదర్శి వాహనానికి నిప్పు

02-08-2025 10:45:07 PM

నంగునూరు: నంగునూరు మండలం తిమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎం.డి. గౌసోద్దీన్ 2వీలర్ వాహనాన్ని గుర్తుతెలియని వ్యక్తులు తగులబెట్టారు. శనివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో తన విధుల నిర్వహణలో భాగంగా వైకుంఠధామం దగ్గరికి తన ఫ్యాషన్ బైక్ (AP 23 R 1196)పై వెళ్లారు. ఆ క్రమంలో తన 2 వీలర్ వాహనాన్ని పార్క్ చేసి,నర్సరీ పనుల కోసం లోపలికి వెళ్ళిన సమయంల గుర్తుతెలియని వ్యక్తి  బైక్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై కార్యదర్శి కౌజుద్దీన్ రాజగోపాల్పేట్  పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా , కేసు నమోదు చేశామని దుశ్చర్యకు పాల్పడిన వారిని గుర్తించేందుకు చర్యలు చేపడుతున్నామని ఎస్సై వివేక్ తెలిపారు.