17 April, 2026 | 3:11 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయా దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

తాళికోట హరికృష్ణకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం

15-11-2025 07:45 PM

కోదాడ: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పాలకమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళికోట హరికృష్ణ కోదాడకు విచ్చేసిన సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తాళికోట హరికృష్ణ మాట్లాడుతూ కనకదుర్గమ్మ అమ్మవారి ఆశీస్సులతో రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో అగ్రభాగాన నిలిచి ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉందని నాయకులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు ముత్తినేని సైదేశ్వర రావు, ఓరుగంటి ప్రభాకర్ లు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.​ ఈ కార్యక్రమంలో గురవయ్య, నరసయ్య, కృష్ణకాంత్, శ్రీనివాస్, వివేకానంద, శ్రీ వాస్తవ, గోపి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.