17 April, 2026 | 3:18 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

పేదల సొంతింటి కలను నిజం చేస్తున్న ప్రజా ప్రభుత్వం..

13-10-2025 11:37 PM

ఎమ్మెల్యే బొజ్జు పటేల్..

ఆదిలాబాద్ (విజయక్రాంతి): స్వంత ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఆశ్రయం ఇవ్వడం మాత్రమే కాదని, అది భవిష్యత్తుకు భరోసా అని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. పీవీటీజీల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పలు సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా సోమవారం ఉట్నూర్ మండలం కామైపేట్ గ్రామానికి చెందిన 140 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేసి, ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేమాట్లాడుతూ...ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం  పిల్లల కలలకు పునాదనీ అన్నారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేసేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పీవీటీజీ కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగుపడే దిశగా ప్రభుత్వం మరో ముఖ్యమైన అడుగు వేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.