15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ఎన్నికల చెక్‌పోస్టులు పరిశీలించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్

13-10-2025 11:39 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): సైబరాబాద్ పోలీసు కమిషనర్, డీసీపీ, ఏసీపీ బాలానగర్‌లతో కలిసి సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఎర్రగడ్డ కల్పతరువు జంక్షన్ వద్ద 13వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఎన్నికల చెక్‌పోస్ట్‌ను సందర్శించారు. అనంతరం ఎర్రగడ్డ ప్రాంతంలోని కీలక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు శాంతియుతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల సందర్భంలో సనత్‌నగర్ పోలీసులు సోమవారం సాయంత్రం 7 గంటలకు ప్రేం నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో ఆక్టివా వాహనంపై ప్రయాణిస్తున్న జహీద్ ఖాన్ (రహమత్‌నగర్) అనే వ్యక్తి వద్ద రూ.2.70 లక్షల నగదు పట్టుబడింది. సరైన ఆధారాలు లేకుండా నగదు తీసుకెళ్తున్నందున ఆ మొత్తాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.