15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతి

13-10-2025 10:26 PM

11 గేట్ల ఎత్తి గోదావరిలోకి నీటిని విడుదల..

చర్ల (విజయక్రాంతి): చర్ల మండలం తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టు వద్దకు సోమవారం సాయంత్రం భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ఛత్తీస్‌గఢ్ తో పాటు స్థానికంగా కురిసిన భారీ వర్షం పడడంతో జలాశయానికి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరుకుంది. దీంతో జలాశయంలో 11 గేట్లను ఎత్తి 21076 వేల క్యూసెక్కుల వరద నీటిని దిగువ గోదావరి విడుదల చేస్తున్నారు. తాలిపేరుకు 15077 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. తాలిపేరుతో పాటు పగిడి వాగు, రోటెంత వాగు, చింతవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితిని ఏఈ సుమన్ పర్యవేక్షిస్తున్నారు.