9 May, 2026 | 4:49 PM

Breaking News

సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్యే సండ్ర   •   దూరదర్శన్ భవన్‌లో అగ్నిప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు   •   టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై వీడని సస్పెన్స్.. వీసీకే పార్టీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ   •   కొత్తగూడెంలో ఘనంగా కంట మహేశ్వరుని కళ్యాణ మహోత్సవం   •   పల్లకి సేవలో వట్టెం వెంకన్న   •   భీమిరెడ్డి నరసింహారెడ్డి 18వ వర్ధంతి   •   మొక్కజొన్న రైతుల ఉసురు తగలదా   •   మూసీలో పడిపోయిన మహిళను కాపాడిన హైడ్రా   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ (ఎన్సిసి) అవగాహన సదస్సు..   •   స్వాములకు ఉచితంగా అన్న ప్రసాదం   •  

జోగుళాంబ సన్నిధిలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి

20-09-2025 11:10 PM

అలంపూర్: జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి ఎన్.వి శ్రావణ్ కుమార్ దంపతులు శనివారం దర్శించుకున్నట్లు ఆలయ ఈవో దీప్తి తెలిపారు.వీరికి ముందుగా ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం జోగులాంబ అమ్మవారికి కుంకుమార్చనలు, బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకాలు వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు.అనంతరం అర్చకులు వారిని శేష వస్త్రంతో సత్కరించి వేద ఆశీర్వచనం అందించారు.వీరి వెంట గద్వాల జిల్లా జడ్జి ప్రేమలత, అలంపూర్ జూనియర్ సివిల్ జడ్జి మిథున్ తేజ ఉన్నారు.