15 April, 2026 | 1:12 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

ముగిసిన టెట్ పరీక్షలు

01-07-2025 02:15 AM

హైదరాబాద్, జూన్30 (విజయక్రాంతి): టెట్ పరీక్షలు సోమవారంతో ముగిశాయి. ఈనెల 18 నుంచి 30 వరకు టెట్ పరీక్షలను నిర్వహించారు. చివరి రోజు పేపర్-1, 2 పరీక్షలు జరగ్గా.. పేపర్‌కు-1కు 47,224 (74. 65 శాతం) మంది హాజరై.. 16,037 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 సోషల్ స్టడీస్‌కు 41,207 (76.73 శాతం) మంది హాజరై 12,499 మంది డుమ్మా కొట్టారు.

పేపర్-2 మ్యాథమెటిక్స్ సైన్స్ అండ్ సోషల్ స్టడీస్‌కు 48,998 (73.48 శాతం) మంది హాజరవగా, 17,688 మంది గైర్హాజరయ్యారు. ప్రాథమిక కీని జూలై 5న విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 8వ తేదీ వర కు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఫలితాలను 22న ప్రకటించే అవకాశముంది.