13-08-2025 12:37:33 AM
- రూ.2 కోట్లతో నిర్మించనున్న మినీ స్టేడియంకు స్థల పరిశీలన
- రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖల మంత్రి వాకిటి శ్రీహరి
వనపర్తి, ఆగస్టు 12 ( విజయక్రాంతి) :అం తర్జాతీయ ప్రమాణాలతో నూతనంగా ని ర్మించనున్న క్రీడామైదానాలతో ఆత్మకూ రు, అమరచింత మున్సిపాలిటీల రూపు రేఖ లు మారిపోనున్నాయని రాష్ట్ర క్రీడలు, యు వజన సర్వీసులు, పశుసంవర్ధక, మత్స్య, డైరీ శాఖల మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. మం గళవారం అమరచింత, ఆత్మకూర్ మున్సిపాలిటీలలో నూతనంగా నిర్మించనున్న క్రీడా మైదానాలకు రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ చైర్మ న్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి స్థల పరిశీలన చేశారు.
దాదాపు రూ. 2.00 కోట్ల అంచనా వ్యయంతో అమరచింత లో నిర్మించనున్న మినీ స్టేడియంలో ప్రస్తుత జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్మించేందుకు స్థల పరిశీ ల న చేశారు. ప్రస్తుతం అక్కడ ఉన్న ఉన్నత పాఠశాల తరగతి గదులను నూతన భవనం లోనికి మార్చి ప్రస్తుతం ఉన్న స్థలంలో అం తర్జాతీయ ప్రమాణాలతో మినీ స్టేడియం ని ర్మించబోతున్నట్లు మంత్రి తెలియజేశారు. మినీ స్టేడియంలో షటిల్ కబడ్డీ వంటి ఆటలకు ఇండోర్ స్టేడియం సైతం ఏర్పాటు చే యడం జరుగుతుందని అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని అధికారులను ఆదేశించారు.
ఆత్మకూరు ము న్సిపాలిటీ పరిధిలో జాతర మైదానం పక్కన అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒక మినీ స్టేడియం, అదేవిధంగా జాతర మైదానంలో నడక వ్యాయామ దారులకు సౌకర్యా లు ఆధునీకరించడంతో పాటు పక్కనే ఒక ఇండోర్ స్టేడియం కొరకు ప్రణాళికలు సిద్ధం చేసి ఇవ్వాలని సూచించారు. ఈ క్రీడా మైదానాలకు దాదాపు 5 కోట్ల నిధులు కేటాయిం చడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చొరవ తీసుకొని 4 ఎకరాల స్థలాన్ని కేటాయించారని, అదేవిధంగా ఇండోర్ స్టేడియం ఏర్పాటుకు సైతం స్థలం కేటాయించినందుకు ధన్యవాదాలు తె లిపారు.
అమరచింత, ఆత్మకూరు లో నిర్మించనున్న క్రీడా మైదానాలకు సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేసి స్పోరట్స్ అథారిటీకి సమర్పిస్తే నెలరోజుల్లో పనులు ప్రా రంభించడం జరుగుతుందని తెలియజేశా రు. అంతర్జాతీయ ప్రమాణాలతో అన్ని హం గులతో క్రీడా మైదానాలు పూర్తి అయితే ఆ త్మకూరు, అమరచింత మున్సిపాలిటీల రూ పు రేఖలు మారిపోయాయని తెలియజేశా రు.
అనంతరం ఆగస్టు 25న హైదరాబాద్ ఎల్.బి.స్టేడియం టెన్నిస్ క్యాంప్లెక్స్ లో నిర్వహించనున్న సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాం ప్ పోస్టరును మంత్రి, స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి , అధికారులతో కలిసి ఆవిష్కరించారు. స్పోరట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర స్పోరట్స్ అథారిటీ మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలదేవి, స్పోరట్స్ అథారిటీ కార్యనిర్వహక ఇంజనీరు అశోక్, డి.డి. చంద్రా రెడ్డి, రవితేజ, జిల్లా యువజన క్రీడల అధికారి సు ధీర్ రెడ్డి, తహసిల్దార్ చాంద్ పాషా, మం డల ప్రజా ప్రతినిధులు, అధికారులు తదితరులు మంత్రి వెంట పాల్గొన్నారు.