17 April, 2026 | 3:01 PM

పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా పరిశీలకురాలు

18-12-2025 12:00 AM

మాసాయిపేట/చేగుంట డిసెంబర్ 17 : మాసాయిపేట మండలం లో  జరుగుతున్న మూడవ విడత పోలింగ్ కేంద్రం సరళని పరిశీలించడానికి మోడల్ పోలింగ్ కేంద్రంమైన ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రాన్ని జిల్లా అబ్జర్వర్ భారతి లక్పతి నాయక్, ఆర్డీవో జయచంద్ర రెడ్డితో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆర్‌ఓకి పలు సూచనలు చేశారు. ఆమె వెంట జిల్లా అడిషనల్ ఎస్పీ మహేందర్, తూప్రాన్ ఆర్డిఓ జయచంద్రరెడ్డి, ఎంపీడీఓ, తహశీల్దార్, రామాయంపేట సీఐ వెంకట్‌రాజాగౌడ్, చేగుంట ఎస్‌ఐ చైతన్యకుమార్‌రెడ్డి, శ్రీకాంత్ ఎంపీవో పాల్గొన్నారు.