17 April, 2026 | 2:45 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

‘పరికరాలు’ గాయబ్..!

22-12-2025 12:00 AM
  1. సీలు వేశారు.. విచారణ మరిచారు 
  2. పోయిన పరికరాలపై చేయని ఫిర్యాదు

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 21, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పా ల్వంచ పట్టణంలో గల డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయంలో దొంగలు పడ్డారు? మైనింగ్ విద్యార్థులు సర్వేకు ఉ పయోగించే పరికరాలు (తెడియోలైట్) ల్యాబుల్లో భద్రపరుస్తుంటారు. మైనింగ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎట్ సైన్స్ విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేస్తున్న సమయంలో సర్వే పరికరాలు మా యం అయినట్లు ల్యాబ్ ఇన్చార్జి గుర్తించినట్టు తెలుస్తోంది.

వెంటనే తెడియోలైట్స్ దొంగలించిన అంశాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ప్రిన్స్ పాలకొల్లు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంఘటన జరిగి ఎనిమిది నెలల అయినప్పటికీ నేటికీ పరికరాల మా యంపై ఎలాంటి విచారణ చేపట్టకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోంది. ఈ సంఘటన తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ 27న సర్వే పరికరాల ల్యాబ్ కు సీల్ వేయడం జరిగింది. దీంతో సీలు వేశారు విచారణ మరి చారు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స ర్వేకు ఉపయోగించే తిదియో లైట్స్ 8 నుంచి 10 వరకు కనిపించట్లేదు అన్నట్టు తెలుస్తోంది.

మైనింగ్ కాలేజ్ ఏర్పాటు సమయం లో సరఫరా చేసిన విలువైన పరికరా లు దొంగిలించబడిన యాజమాన్యం పట్టించుకోకపోవడం శోచనీయం. వీటితోపాటు స మీపంలోని రేకుల షెడ్డులో గల స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ పరికరాలు, ల్యాబ్ లోని మరికొన్ని పరికరాలు సైతం మటుమాయం అ యినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికై నా విశ్వవిద్యాలయం ఉన్నతాధికారులు విశ్వవిద్యాలయంలో దొంగిలించబడిన పరికరా లపై విచారణ చేపట్టి అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు డిమాం డ్ చేస్తున్నారు.

ఈ విషయమై విశ్వవిద్యాల యం ప్రిన్సిపాల్ జగన్మోహన్ రాజును వివరణ కోరగా ఈ సంఘటన గత విద్యా సంవ త్సరం ఆఖరి రోజుల్లో జరిగిందని, దానిపై విశ్వవిద్యాలయానికి ఫిర్యాదు చేశామన్నారు. తాజాగా ఎలాంటి దొంగతనాలు చోటు చేసుకోలేదని, ఏమైనా జరిగినట్లు వెల్లడైతే చర్యలు తీసుకుంటామన్నారు. ఇలా ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ లో ల్యాబ్ కు వేసిన సీల్ ఇప్పటివరకు ఓపెన్ చేయకపోవడం అనుమానాలకు దారితీస్తోంది.