calender_icon.png 9 January, 2026 | 5:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించాలి

06-01-2026 12:00:00 AM

కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ, జనవరి 5 (విజయక్రాంతి): నీట్ పరీక్ష కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ అధికారులకు తెలిపారు. సోమవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో  నీట్ పరీక్షలు- 2026 నిర్వాహణ పై  సమన్వయ సమావేశం  డిసిపి రాజమహేంద్ర నాయక్ తో కలిసి జిల్లా కలెక్టర్ పరీక్షల ఏర్పాట్లపై  విద్యాశాఖ  అధికారులకు పలు  సూచనలు, సలహాలు చేశారు.

ఈ పరీక్షకై జిల్లాలో 2 సెంటర్లు ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్, మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ ను  కేటాయించగా అందులో మొత్తం సుమారు 650 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని  తెలిపారు. మే -2026 సంవత్సరంలో నీట్ పరీక్షలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. శ్రీనివాస్, విద్యాశాఖ అధికారులు సత్యమూర్తి, శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.