17 April, 2026 | 3:17 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

సర్పంచ్‌ను సన్మానించిన మాజీ ఎమ్మెల్యే

22-12-2025 12:50 AM

మర్రిగూడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో యరగండ్లపల్లి  గ్రామంలో టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా 627 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందిన  సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ తో పాటు వార్డ్ మెంబెర్స్  గా అత్యంత మెజారిటీ తో గెలుపొందిన వార్డ్ సభ్యులను ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసం లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.

ఊరిలో వీధి దీపాలు,మంచి నీరు,పారిశుద్యం విషయంలో గ్రామంలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని  చెప్పారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పు డూ అందుబాటులో ఉండాలని మన పార్టీ పక్క పార్టీ అనుకోకుండా ఆపద వచ్చిన ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులు గానే భావించి ఆదుకోవాలని వారి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ , వార్డ్ సబ్యులకు దిశా నిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో ఎరగండ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దం శ్రీనివాస్ గౌడ్, ,మాల్ మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, పార్టీ సీని యర్ నాయకులు వనపర్తి వెంకటయ్య, ముత్యం రెడ్డి ,వనపర్తి నర్సింహా, సేగోజు నర్సింహా చారీ,గుంటోజు శ్రీనివాసా చారి, కోడిచెర్ల అంజయ్య, ఉప్పునూతుల మల్లేష్, కట్ల యాదయ్య, పార్టీ కార్యకర్తలు అయితగొని అంజయ్య,నారోజు అనిల్ చారీ, ఈడా గోని శ్రీను, క్రిష్ణ, వడ్డేపల్లి గణేష్, గిరి, సూరు అబ్బయ్య  కార్యకర్తలు పాల్గొన్నారు.