16 April, 2026 | 11:53 AM

Breaking News

కామ్రేడ్ పెద్దబ్బాయికు నివాళులర్పించిన పోతినేని సుదర్శన్   •   కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఎనిమిది మంది భక్తులు మృతి   •   మాజీ సర్పంచ్ ను పరామర్శించిన మంత్రి పొంగులేటి   •   స్టేట్ 2వ ర్యాంక్ సాధించిన విద్యార్థినికి ఘన సత్కారం   •   ప్రముఖ గాయని ఆశా భోస్లే మృతి పట్ల లోక్‌సభ సంతాపం   •   డీలిమిటేషన్ పై దేశవ్యాప్తంగా ఉత్కంఠ   •   వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   అదృశ్యమైన వ్యక్తి దారుణ హత్య.. పొలాల్లో లభ్యమైన బూడిద, అస్తికలు   •   ఆక్రమణలు తొలగించి అభివృద్ధికి సహకరించండి.   •   జై కిసాన్ రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులుగా కొత్త మహేష్   •  

సీపీఐ వందేళ్ల ఉద్యమ చరిత్రను ప్రజలకు వివరించాలి

04-11-2025 12:00 AM

కరీంనగర్, నవంబరు 3 (విజయ క్రాంతి): సిపిఐ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఊరురా, వాడ వాడన సిపిఐ జెండాలు ఎగురవేస్తూ, పార్టీ నిర్వహించిన ప్రజోద్యమాలను యా వన్మంది ప్రజానీకానికి వివరించాల్సిన అవశ్యకత నాయకత్వంపై ఉందని సిపిఐ జాతీయ మాజీ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు.

సోమవారం సిపిఐ కరీంనగర్ జిల్లా కార్యవర్గ, కౌన్సిల్ సభ్యుల సమావేశం నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న భారత దేశంలో ఆవిర్భవించిన సిపిఐ వచ్చే డిసెంబర్ 26నాటికి వందేళ్లు నిండుతాయని, ఆ సందర్భంగా సిపిఐ నిర్వహించిన ఉద్యమ ఘట్టాలను, విజయాలను, మహోజ్వల చరిత్రను నేటితరానికి, ప్రతి గడపగడపకు వెళ్ళి తెలియజేయాలని అన్నారు.

ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందె స్వామి, జిల్లా కార్యవర్గ సభ్యులు మర్రి వెంకటస్వామి, బోయిని అశోక్, గూడెం లక్ష్మి, బత్తుల బాబు, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, తదితరులుపాల్గొన్నారు.