9 April, 2026 | 11:05 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకున్న భర్త

30-07-2024 12:24 AM

కుటుంబ కలహాలే కారణం

రాజన్న సిరిసిల్ల, జూలై 29 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. సిరిసిల్ల పట్టణంలోని శాంతినగర్‌కు చెందిన దూస రాజేశం(54), లక్ష్మి(50) దంపతులు. వారికి ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. పెద్ద కొడుకు వేణు, కూతురు మౌనికకు వివాహం కాగా చిన్న కొడుకు వెంకటేష్ చదువుకుంటున్నాడు. రాజేశంకు రెండు కిడ్నీలు చెడిపోవడంతో కొన్ని రోజులుగా డయాలసిస్ చేయించుకుంటున్నాడు.

అప్పటి నుంచి వారి జీవితంలో కలహాలు మొదలయ్యాయి. దానికి తోడు గత ఆరు నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో తరుచూ ఇంట్లో గొడవలు జరిగేవి. భార్య సూటి పోటి మాటలకు రాజేశం విసుగు చెందాడు. ఈ క్రమంలోనే సోమవారం మళ్లీ ఇద్దరూ గొడవపడ్డారు. క్షణికావేశంలో బలమైన వస్తువుతో లక్ష్మి ముఖంపై కొట్టి హత్య చేశాడు. అనంతరం రాజేశం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజేశం కుటుంబంలో ఉపాధి లేమి సమస్య భార్యాభర్తల మధ్య గొడవకు దారి తీసిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.