17 April, 2026 | 2:39 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

బాధిత కుటుంబానికి మంత్రి తనయుడు ఆర్థిక సాయం

24-01-2026 12:21 AM

వెంకటాపూర్, జనవరి23,(విజయక్రాంతి): మండలంలోని జవహర్ నగర్ గ్రామానికి చెందిన త్రికోవేల నారాయణ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందగా, ఈ విషయం తెలుసుకున్న మంత్రి సీతక్క తనయుడు, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సూర్య శుక్రవారం జవహర్ నగర్ గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా నారాయణ మృతికి గల కారణాల ను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆర్థిక సాయం అందజేశారు. నారాయణ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, అవసరమైన సమయంలో అన్ని విధాలా సహకరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి, మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మమత, మండల యూత్ ఉపాధ్యక్షుడు రాజు, గ్రామ సర్పంచ్ జైల్ సింగ్, ఉప సర్పంచ్ తిరుపతి కృష్ణ, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి, జిల్లా యూత్ నాయకులు తిరుపతి, మహిపాల్ రెడ్డి, రాజేష్, సందీప్, నాయకులు పాల్గొన్నారు.