14 July, 2026 | 6:55 PM

Breaking News

విద్యార్థుల‌పై శ్ర‌ద్ద చూపండి   •   కాలభైరవ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యం   •   కరాటేతోనే విద్యార్థినులకు ఆత్మరక్షణ   •   తెలంగాణను మళ్లీ ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోంది   •   భద్రతా చర్యలపై బ్యాంక్ మేనేజర్లకు అవగాహన కల్పించిన సీఐ రంజిత్ రావు   •   మండలాధ్యక్షునిపై అసంతృప్తి రాగాలు   •   చిట్యాల–భువనగిరి రహదారి విస్తరణపై స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ వినతి   •   విద్యార్థి దశ నుంచే ప్రజాస్వామ్య వ్యవస్థపై అవగాహన కల్గి ఉండాలి   •   సింగరేణి హెడ్ఆఫీస్ ముందు జరిగే ధర్నాను జయప్రదం చేయండి: ఐఎఫ్టియు   •  

నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే

24-01-2026 12:20 AM

కోదాడ, జనవరి 23: సూర్యాపేట జిల్లా పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సముద్రాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి పత్తిపాక జనార్ధన్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కుల సంఘాలు సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బుడిగం కిరణ్ కుమార్, రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు తునం కృష్ణ, బచ్చు అశోక్, పీ.వేణుధర్, పి. నర్సయ్య, నట్టె కిరణ్ కుమార్, బత్తిని కృష్ణమూర్తి, శివయ్య, కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.