22 June, 2026 | 1:31 PM

Breaking News

తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్యా థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •   మోడల్ స్కూల్లో మంచినీటి ఎద్దడి తీర్చిన ఎమ్మెల్యే   •   చినుకు రాలేదు.. చింత తీరదు.. అదనపు ఖర్చులతో రైతు ఇబ్బంది   •   యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి   •   APSRTC బస్సు, లారీ ఢీ: ఇద్దరు మృతి, 16 మందికి గాయాలు   •   ప్రీ-ప్రైమరీ స్కూల్.. చిన్నారుల ఉజ్వల భవిష్యత్తుకు బలమైన పునాది   •  

నూతన కార్యవర్గాన్ని అభినందించిన ఎమ్మెల్యే

24-01-2026 12:20 AM

కోదాడ, జనవరి 23: సూర్యాపేట జిల్లా పెరిక సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన సముద్రాల రాంబాబు, ప్రధాన కార్యదర్శి పత్తిపాక జనార్ధన్లు కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శుక్రవారం కోదాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో  ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలియజేసి, వారిని శాలువాతో ఘనంగా సన్మానించారు. కుల సంఘాలు సామాజిక అభివృద్ధికి తోడ్పడాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో యూత్ అధ్యక్షుడు బుడిగం కిరణ్ కుమార్, రాష్ట్ర లారీ అసోసియేషన్ చైర్మన్ రామినేని శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావు, పెరిక హాస్టల్ ప్రధాన కార్యదర్శి సుందరి వెంకటేశ్వర్లు, లారీ అసోసియేషన్ అధ్యక్షులు తునం కృష్ణ, బచ్చు అశోక్, పీ.వేణుధర్, పి. నర్సయ్య, నట్టె కిరణ్ కుమార్, బత్తిని కృష్ణమూర్తి, శివయ్య, కోటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.