1 August, 2026 | 6:10 PM

Breaking News

తల్లిపాలు బిడ్డకు అమూల్యమైన వరం   •   విద్యార్థులను మనోవేదనకు గురి చేస్తున్న ప్రభుత్వం   •   విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలి   •   సోనాల మండల కేంద్రానికి తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు   •   అనురాగ్ లో కెరీర్ క్యాటలిస్ట్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఫర్ ప్లేస్మెంట్ సక్సెస్ వర్క్ షాప్   •   గోదావరి ఉధృతి.. జలదిగ్బంధంలో బూర్గంపాడు   •   వరదలు సాధారణ స్థితికి వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ముంపు బాధితులు తల దాచుకోవాలి   •   అడ్మిషన్ పేరుతో విద్యార్థుల నుండి పైసలు వసూలు   •   సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్ఐ క్రాంతి   •   నవజాత శిశువుకు తల్లిపాలే రక్షణ కవచం   •  

విద్యారంగానికి ప్రజాప్రభుత్వం అధిక ప్రాధాన్యం

25-11-2025 12:36 AM

వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి

వనపర్తి, నవంబర్ 24 (విజయక్రాంతి) : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యం లోని ప్రజా ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మరికుంట మెడికల్ కాలేజీ సమీపంలో 20 ఎకరాలలో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ భవన నిర్మాణ పనులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. 

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నూతన ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చదువుకున్న పాఠశాల, కళాశాలను రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దడం కోసం ప్రభుత్వం రూ. 50 కోట్లతో నూతన భవనాలను నిర్మించేందుకు శ్రీకారం చుట్టిందని తెలిపారు.

ప్రస్తుతం నిర్మించబోయే కొత్త ప్రభుత్వ పాఠశాల భవన నిర్మాణం వనపర్తి లో ఉన్న చారిత్రక రాజభవనం నిర్మాణ శైలిని పోలి ఉంటుందని అన్నారు. రాబోయే సంవత్సర కాలంలో ఈ పాఠశాల భవన నిర్మాణ పనులను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి  తెచ్చే విధంగా పనులు ముమ్మరం చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు సాయి చరణ్ రెడ్డి, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.