30 June, 2026 | 9:37 PM

Breaking News

దుండిగల్ వార్డులో సీఎంసీ కమిషనర్ శ్రీజన ఐఎఎస్ పర్యటన   •   అక్కంపల్లి గ్రామంలో హరితవనాలు, ఫిట్టింగ్ పనులు పరిశీలించిన డిఆర్డిఓ కుటుంబరావు   •   హనుమాన్ ఆలయంలో చోరీ   •   డీడీఎన్ అర్చక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బసవలింగప్ప ఎన్నిక   •   తెలంగాణకు బిఆర్ఎస్ పార్టీనే... శ్రీరామరక్ష   •   రైతుల పాలిట శాపంగా మారిన యూరియా మొబైల్ యాప్: సనప విష్ణు   •   ఎఫ్‌పీఓలతో రైతులు ఆర్థికంగా బలోపేతం   •   పేదల ఇండ్ల సమస్యపై జులై 1న చలో కలెక్టరేట్   •   పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులకు సన్మానించిన ఎస్పీ రోహిత్ రాజ్   •   జూన్‌లో 171 శాతం బొగ్గు ఉత్పత్తి సాధించిన మణుగూరు ఏరియా   •  

ఆసమర్థుల పాలనలో రాష్ట్రం ఆగం

28-03-2025 12:00 AM

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ 

కాగజ్‌నగర్, మార్చి 27 (విజయక్రాంతి): అసమర్థుల పాలనలో రాష్ట్రం ఆగమవుతుందని బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. గురువారం కాగజ్ నగర్ మండ లం కోసిని గ్రామంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గు చేటని విమర్శించారు. రాష్ట్రంలో పరీక్ష కేం ద్రాల వద్ద కట్టుదిట్టమైన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్ర ఇంటలిజెన్స్ వ్యవస్థ పనిచేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. నకిరేకల్ లో పదవ తరగతి తెలుగు ప్రశ్న పత్రం లీకేజీ కావడం కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు నిదర్శనమని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పరిపా లనను పక్కనపెట్టి ప్రతిపక్షాలపై ప్రతీకార చర్యలు తీసుకోవడానికి పనిచేస్తున్నారని విమర్శించారు.

ప్రజా సంక్షేమం పూర్తిగా గాడి తప్పిందని, గడిచిన ఏడాది కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలలో చదువుతున్న 68 మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న పాపం కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడం రాకుంటే తప్పుకోవాలి కానీ ప్రశ్నించే ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం సరికాదని పీతవు పలికారు. ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకుడు శ్యామ్ రావు తదితరులు పాల్గొన్నారు.