13 July, 2026 | 9:38 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

ప్రతిభను వెలికి తీయడానికే టోర్నమెంట్

08-01-2026 12:06 AM

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్, జనవరి 7 (విజయక్రాంతి): యువ క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీయడానికి ప్రతి ఏడాది రాజీవ్ గాంధీ పేరిట క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ జరుగుతోందని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాం గ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అన్నారు. రాజీవ్ గాంధీ ఆలిండియా అండర్ 19 టీ-20 క్రికెట్ చాంపియన్ షిప్ 2026 కు మాజీ రాజ్యసభ సభ్యుడు విహెచ్ హనుమంత రావు, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రి మహమ్మద్ అజారుద్దీన్‌లతో కలిసి బుధవారం హాజరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్ర మంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేశ్, డీసీసీ అధ్యక్షులు, కార్పొరేషన్ల చైర్మన్లు, కాంగ్రెస్ నాయకులు తదితరులు హాజరయ్యారని ఎమ్మెల్యే తెలిపారు.