15 April, 2026 | 12:31 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

16-11-2025 07:32 PM

కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు

రామగిరి (విజయక్రాంతి): రైతుల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి వరి గింజను కొనుగోలు చేస్తామని ఇది రైతు ప్రభుత్వమని కమాన్ పూర్ ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు అన్నారు. మండలంలోనీ లొంగకేసారం, కల్వచర్ల, నవాబ్ పేట, రత్నాపూర్, లద్నా పూర్, రాజాపూర్, ముస్త్యాల గ్రామాల్లో ఇందిరా క్రాంతి పథకం ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట్ల తిరుపతి యాదవ్ లతో కలిసి ఏఎంసి చైర్మన్ వైనాల రాజు ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కస్టపడి పండించిన వరి ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు.

ప్రభుత్వం మద్దతు ధరతో రైతులకు మేలు చేసే విధంగా గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రైతుకు సౌకర్యకరంగా గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భారతదేశంలో తెలంగాణ రాష్ట్రానికి దక్కిందని పేర్కొన్నారు. గత సర్కార్ పాలు తప్ప ఐదు కిలోల వరకు కోత విధించేవారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శైలజ రాణి, వ్యవసాయ అధికారి చిందం శ్రీకాంత్, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లు గుగులోతు ప్రవీణ్ నాయక్, సిద్ధం మురళీకృష్ణ, ఆరెల్లి శ్రీనివాస్ గౌడ్, మాజీ సర్పంచ్ ఎండి మంజూర్, ఆరెల్లి కొండయ్య, ముత్యాల శ్రీనివాస్, వరం రామచంద్రరావు, స్వామి గౌడ్, కాటసత్యం, లల్లు తదితరులు పాల్గొన్నారు.